ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని దసరా రోజున ప్రారంభిస్తున్నట్టు రామ్గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన
సంగతి తెలిసిందే. చాలా స్పీడుగా ఈ సినిమాని పూర్తి చేసి జనవరి నెలాఖరులో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ నెల 19న తిరుపతిలో జరిగే మీడియా సమావేశంలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని సోషల్ మీడియాలో ప్రకటన చేసారు. అయితే ఈ ప్రకటన తో ఖచ్చితంగా బాలయ్య, క్రిష్ షాక్ అవుతారంటోంది మీడియా.
ఆగిపోయిందనుకున్న సినిమాని బయిటకు తీసి ప్రకటించటంతో బాలయ్య చాలా కోపంగా ఉన్నాడంటున్నారు. తమ బయోపిక్ లో ఎక్కడా లక్ష్మీ పార్వతి ప్రస్దావన ఉండకుండా చూసుకుంటే…వర్మ మధ్యలో ఇలా సినిమా మొదలెట్టి..లక్ష్మి పార్వతి యాంగిల్ లో కథ నడుపుతామనటం ఇబ్బందికర అంశమే అని భావిస్తున్నారట.
ఈ విషయమై వర్మతో మాట్లాడాలనే ఆలోచనతో ఉన్నారట. డైరక్టర్ పూరి జగన్నాథ్ ద్వారా వర్మతో మీటింగ్ జరుగే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే మీరు సినిమా ఆపేయండి అని బాలయ్య ఎలా చెప్తారు..చెప్తే వర్మ వింటారా అనే సందేహం అందరిలో మొదలైంది.
జి.వి.ఫిల్మ్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ రెడ్డి నిర్మాత. ఎన్టీఆర్ వాస్తవ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ముంబైకి చెందిన
జి.వి.ఫిల్మ్స్ ఎమ్.డి బాలగిరి ఆధ్వర్యంలో జరుగుతుందని, ఊహించని అతిథులు ఈ వేడుకకి హాజరవుతున్నారని వర్మ తెలిపారు.
‘‘ముహూర్తం ప్రకారం సినిమాని ఆరంభించడం నా కెరీర్లో ఇదే తొలిసారి. అది కూడా తిరుపతి బాలాజీ పాదాల దగ్గర. ఎన్టీఆర్పై నాకున్న గౌరవం అది’’ అని ట్వీట్ చేశారు.