ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్ను సాధించింది.
ఈ సందర్బంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ ‘నేను ఈ మధ్య కాలంలో చేసిన రెండు మంచి పనులు రామ్ ను కలకడం, ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయడం. అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు మెచ్చుకున్నారు. రామ్ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. ఈ సినిమా విజయ యాత్రకి వెళ్ళినప్పుడు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. రామ్ పాత్ర గురించి మాట్లాడుకోడం ఆనందమేసింది’ అన్నారు.