‘యాత్ర’లో ఏమైనా తేడా జరిగిఉంటే

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి.వి.రాఘవ్ ‘యాత్ర’.యాత్ర సినిమా మాత్రం చాలా త‌క్కువ అంచ‌నాల‌తో వ‌చ్చి.. స్టార్ వ్యాల్యూ కూడా పెద్ద‌గా లేని ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా అడుగులేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది మూడో రోజు కూడా క‌లెక్ష‌న్లు భారీగానే ఉన్నాయి.

ఆదివారం కావ‌డంతో క‌చ్చితంగా 3 కోట్ల‌కు పైగా షేర్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. దానికి తోడు వైఎస్ఆర్సిపీ నేత‌లు కూడా ప్ర‌త్యేకంగా టికెట్స్ బుక్ చేసుకుని మ‌రీ థియేట‌ర్స్ నింపేయటం కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మహి.వి.రాఘవ్ వైఎస్ కుమారుడు జగన్, ఆయన కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈరోజు రాఘవ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నాపై నమ్మకం ఉంచి, గుడ్డిగా నమ్మి రాజశేఖరరెడ్డి గారి జీవిత చరిత్రను చెప్పిన వైఎస్ జగన్ అన్నకు, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటాను. ‘యాత్ర’ సినిమాలో ఏదైనా తేడా జరిగిఉంటే వాళ్లు(జగన్ కుటుంబం)చాలా నష్టపోయేవారు. ఫలితం ఎలా ఉన్నా నాకు లాభం తప్ప నష్టముండేది కాదు. అయినా నన్ను అంతగా నమ్మి ఎందుకు రిస్క్ తీసుకున్నారంటే చెప్పడం కష్టమే’ అని ట్వీట్ చేశారు.