దాదాపు ఐదు సంవత్సరల పాటు బాహుబలి చేస్తూండిపోయిన ప్రభాస్ ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో సాహో అనే చిత్రాన్ని చేస్తున్నారు. సాహో తర్వాత గోపీచంద్ తో జిల్ చిత్రం అందించిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు స్వయంగా నిర్మిస్తున్నారు.
తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందనున్న ఈ చిత్రం గురించి ఓ అప్ డేట్ ని దర్శకుడు ట్విట్టర్ లో అందించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది 2019 చివర్లో ప్రేక్షకులముందుకు రానుందని తెలియచేసారు.
పిరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల ఇటలీ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అందమైన ప్రేమ కథా చిత్రంగా, అభిమానులందరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని రాధాకృష్ణ చెప్పాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మరో ప్రక్క ప్రభాస్ చేస్తున్న సాహో చిత్రం భారీ బడ్జెట్తో ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్తో రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ రూపొందుతుున్న ‘సాహో’ షూటింగ్ 80శాతం కంప్లీట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఇలా ప్రభాస్ వచ్చే ఏడాది రెండు సినిమాలతో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాడు.