(సూర్యం)
హీరోయిన్స్ సాధారణంగా గ్లామర్ రోల్స్ లో కనపడటానికి ఉత్సాహం చూపిస్తారు. ఎవరూ యాసిడ్ బాధితురాలిగా కనపడటానికి ఆసక్తి చూపంచరు. ఎందకంటే ఆ ఇమేజ్ తో తమ అభిమానులకు కనపడటం ఇష్టం లేక. అలాంటి పాత్రలను అర్ట్ సినిమాలు చేసే హీరోయిన్స్ చేస్తారు. కానీ దీపిక పదుకోని అలా కాదు..తను ఎంత గ్లామర్ క్వీన్ అయినా ఓ సారి ప్రయోగం చెయ్యాలనుకుంటోంది.
ఆమె త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో లక్ష్మి అగర్వాల్ అనే 32 ఏళ్ల యాసిడ్ దాడి జరిగిన బాధితురాలి పాత్రలో నటించనున్నారు. ఓ దుర్మార్గుడు కారణంగా నాశనం అయ్యిపోయి..న ఓ మహిళ జీవితాధారంగా ఈ సినిమా చేస్తోంది. అలాగే ఈ సినిమాకు దీపికే నిర్మాత కూడాను. ఈ విషయం నిజమేనా అనే డౌట్ వస్తోంది కదా..ఈ విషయాన్నిఆమే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
దీపిక మాట్లాడుతూ…. ‘ఈ కథ విన్నాక నేనెంతో ఎమోషన్ కు లోనయ్యాను. ఇది కేవలం పోరాటానికి సంబంధించినదే కాదు ఆశ, గెలుపు నేపథ్యంలో సాగే కథ. ఈ కథ నాపై ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే కేవలం యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారాను.’ అని చెప్పుకొచ్చారామె.
ఈ వార్త చదివిన ప్రతీ ఒక్కరూ..ఏ తెలుగు హీరోయిన్ అయినా ఇలాంటి పాత్ర చేయటానికి ఇష్టపడతారా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా..ఎవరికా ధైర్యం ఉంది
