(ధ్యాన్)
ఫిదాతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల తదుపరి సినిమాకు రెడీ అవుతున్నారు. కథంతా సిద్ధమైంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోగా చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించబోతున్నాడు. కాగా హీరోయిన్ కూడా ఫైనలైజ్ అయ్యిందనే వార్తలు వినపడుతున్నాయి. రీసెంట్గా శేఖర్ కమ్ముల ఫిదా హీరోయిన్ సాయి పల్లవినే సంప్రదించాడట. కథ, క్యారెక్టరైజేషన్ విన్న సాయిపల్లవి సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉందని సమాచారం. అక్టోబర్లో ప్రారంభం కాబోయే ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ములే నిర్మిస్తాడు. త్వరలోనే అధికారిక సమాచారం రానుంది.