‘గురుశ్రీ’ పురస్కారం అందుకున్న బ్రహ్మనందం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందం ‘గురుశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణాష్టమి పురస్కరించుకుని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మనందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గురుశ్రీ పురస్కారాన్ని అందించిన అసోసియేషన్ హాస్యబ్రహ్మకు స్వర్ణకంకణ ధారణ చేసింది. ఈ సందర్బంగా బ్రహ్మనందం మాట్లాడుతూ … ఆదిపరాశక్తి కుమారులే త్రిమూర్తులని పేర్కొన్నారు. వీరిలో  సృష్టించేవాడు (జనరేటర్) బ్రహ్మ అయితే , నడిపించే వాడు (ఆర్గనైటర్) విష్ణువని, ఇక తీసుకెళ్ళేవాడు (డిస్ట్రాయర్) శివుడిని, ఈ ముగ్గురినీ కలిపి దేవుడు (జీవోడి- గాడ్) అంటారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు పాల్గొన్నారు.