ప్రముఖ దర్శకుని ఆఫీసుకు బాంబు బెదిరింపులు

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఆగంతకుడు ఫోన్ చేసి కార్యాలయంలో బాంబు పెట్టినట్టు బెదిరించాడు. చైన్నైలోని అభిరామపురంలోని మణిరత్నం ఆఫీసును బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరించినట్టుగా మణిరత్నం ఆఫీసు సిబ్బంది తెలిపారు.

మణిరత్నం దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం నవాబ్ ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమాలో పలు అభ్యంతరకర డైలాగ్ లు ఉన్నాయని వాటిని తొలగించాలని కాల్ చేసిన యువకుడు బెదిరించాడు. ఏ డైలాగ్ లు తొలగించాలో వాటిని మాత్రం చెప్పలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మణిరత్నం ఆఫీసుకు భద్రత కల్పించారు.

తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నవాబ్ చిత్రం విడుదలైంది. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాట 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి రాబడి వసూలు చేస్తుంది.