‘యాత్ర’చూడకుండా అడ్డుకున్న పోలీసులు!

వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఫిబ్రవరి 8న రిలీజైన ‘యాత్ర’కు ప్రేక్షకులు మంచి హిట్ చేసారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోవటం ప్లస్ అయ్యింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించిన ఈ సినిమా పలు చోట్ల ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వైఎస్సార్‌ పాత్రలో మళయాల మెగాస్టార్‌ మమ్ముట్టి ఆకట్టుకున్నారు.వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా మమ్ముట్టి నటించిన తీరు, మహి వీ రాఘవ పనితీరు అందరికీ నచ్చుతోంది.

అయితే ఈ రోజు యాత్ర సినిమా ఆడుతున్న థియోటర్స్ వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు జులుం ప్రదర్శించారు. తిరుపతిలోని పలని థియేటర్‌ వద్ద మంగళవారం పోలీసులు కాస్త హడావిడి చేసారు. ఈ సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను థియేటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ప్రేక్షకులు, స్థానికులు , లోగల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మమ్ముట్టి, రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు.