సహజీవనం చేసి..సాంతం నాకేద్దామని

ఆ మధ్యన సెక్స్ రాకెట్ లో దొరికిన తారా చౌదిరి గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె తాజాగా తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసారంటూ పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమేగాక తన ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్నాడని తారా చౌదరి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. తారా చౌదరి హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీ సమీపంలోని గణపతి కాంప్లెక్స్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. 2016లో ఆమెకు వరుసకు బావ అయిన చావా రాజ్‌కుమార్‌ తన సోదరి సుజాతతో కలిసి గుంటూరులోని తారా చౌదరి ఇంటికి వచ్చాడు. తాను తారా చౌదరిని పెళ్ళి చేసుకుంటానని చెప్పగా ఇంతకుముందే పెళ్లయినందున ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించింది. దీంతో రాజ్‌కుమార్‌ సోదరి అయిన సుజాత కోర్టుకు వెళ్ళి విడాకులు తెచ్చుకుని పెళ్లి చేసుకుంటాడని తెలిపింది.

ఆ తర్వాత ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి గణపతి కాంప్లెక్స్‌ సమీపంలో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని సహజీవనం చేయసాగారు. అందరికీ తారా చౌదరిని తన భార్యగా పరిచయం చేసేవాడు. కొద్ది రోజుల అనంతరం తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని ఆస్తులు ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించింది.

తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, గత రెండేళ్లుగా రాజ్‌కుమార్‌ తనను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు చావా రాజ్‌కుమార్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.