వైరల్ అవుతున్న నాగ్ ట్వీట్

నాగార్జున ఒళ్లు నొప్పులే హాట్ టాపిక్

 ఇప్పుడే వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నట్లు..కానీ ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయంటూ నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయన త్వరగా ఒళ్లు నొప్పుల నుంచి కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అదే సమయంలో ఆయన తన అభిమానులకు చెప్పిన జాగ్రత్తలు ని కూడా వైరల్ చేస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంటి పరిసరాలు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో మురికి నీటిని శుభ్రం చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్టు చేశారు. మురికి నీటి వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని, దాని వల్ల అనారోగ్యానికి గురవుతామని, జాగ్రత్తగా ఉండమని పేర్కొన్నారు.

<

p style=”text-align: justify”>‘ఇప్పుడే వైరల్‌ జ్వరం నుంచి కోలుకున్నా. ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. దోమలు వ్యాప్తి చెందకుండా ఆపుదాం. ఇల్లు, అన్నపూర్ణ స్టూడియోస్‌ పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూడమని మా వారితో చెప్పా. మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా. మీ ఇల్లు, పని చేస్తున్న ప్రదేశాల్లోని మురికి నీటిని తొలగించండి’ అంటూ నాగ్‌ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు. దీంతోపాటు కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేశారు.