టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ సింగర్ మృతి

దేవదాసు సినిమాలోని ‘అంతా భ్రాంతియేనా…జీవితాన వెలుగింతేనా’ సాంగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ గానాన్ని ఆలపించిన సీనియర్ సింగర్ కే.రాణి కన్ను మూశారు. ఆవిడ వయసు 75 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్, కళ్యాణ్ నగర్లో ఉంటున్న తన కుమార్తె విజయ నివాసంలో ఆఖరి శ్వాస విడిచారు రాణి.

తెలుగులో సుమారు 500 లకు పైగా పాటలు పాడారు. తమిళం,కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, సిన్హాల, ఉజ్జెక్ వంటి పలు భాషల్లో తన గాత్రాన్ని ఆలపించారు రాణి. శ్రీలంక జాతీయ గీతాన్ని ఆలపించి అరుదైన ఘనత సాధించారు. రూపవతి సినిమాతో తెలుగులో తన కెరీర్ ప్రారంభించారు. పెళ్లి తర్వాత సినీ సంగీతానికి దూరమయ్యారు. నేషనల్ కాంగ్రెస్ నాయకుడు ఆమెను ‘ఇన్నిసాయ్ రాణి’ అని ప్రశంసించారు. సర్వేపల్లి రాధాకృష్ణగారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శన ఇచ్చిన ఘనత కూడా ఆవిడదే.