లోకేష్ కు పిచ్చి ముదిరిపోతోందనే అనిపిస్తోంది. నోటికేదొస్తే అది మాట్లాడేస్తు తనలోని మూర్ఖత్వాన్ని తనంతట తానే బయటపెట్టుకుంటున్నారు. మంగళగిరిలో నామినేషన్ వేసిన దగ్గర నుండి నియోజకవర్గంలోని జనాలను లోకేష్ కామిడితో ఒకటే నవ్విస్తున్నారు. లోకేష్ మాట్లాడుతున్నారంటే జనాలకు ఎంత హుషారుగా ఉంటున్నారో చెప్పనే అక్కర్లేదు. లోకేష్ లాగ పిచ్చ కామిడీతో (మూర్ఖంగా) మాట్లాడే రాజకీయ నేతలు ఏపిలో లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా మంగళగిరి ప్రచారంలో కూడా అలాగే మాట్లాడి నవ్వుల పువ్వులు పూయించారు.
అసలు కామిడీ పండించటానికే లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారా ? అనే అనుమానం కూడా వస్తోంది. ప్రచారంలో భాగంగా గుంటూరును ‘గుంత్రు’ అన్నారు. మంగళగిరిని ‘మందలగిరి’ అంటూ పలికి నవ్వులు పూయించారు. ఏప్రిలో 11వ తేదీ పోలింగ్ కు బదులు ఏప్రిల్ 9వ తేదీన జరిగే పోలింగ్ లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసి పిచ్చ కామిడీ చేశారు.
తాజాగా లోకేష్ మాట్లాడుతూ, కెసియార్ ఏపికి వస్తున్నారంటే అందుకు రెండు కారణాలున్నాయని సెలవిచ్చారు. అవేమిటంటే, మొదటిది పోలవరం ప్రాజెక్టును ఆపటానికట. ప్రాజెక్టు పరిధిలోని ఏడు ముంపు మండలాలను తిరిగి తెలంగాణా రాష్ట్రంలో కలుపుకోవాలని కెసియార్ ప్రయత్నిస్తున్నారట. విభజన చట్టం ద్వారా తెలంగాణాలోని ఏడు ముంపు మండలాలు ఏపికి బదాలియింపైన విషయం అందరికీ తెలిసిందే. మరి ఏపిలో కలిసిపోయిన ఏడు మండలాలను కెసియార్ ఎలా తిరిగి తీసుకుపోగలరు ? లోకేష్ కే తెలియాలి.
సరే ఆ విషయాన్ని పక్కనపెడితే రెండో అంశంపైనే లోకేష్ మాటలు విన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేమిటంటే, మచిలీపట్నంలో ఉన్న పోర్టును కెసియార్ తెలంగాణాకు తరలించుకుపోవటానికి ప్లాన్ చేస్తున్నారట. లోకేష్ మాటల్లో ఏమన్నా అర్ధముందా ? ఏమన్నా అంటే అన్నారంటారు కానీ ఇలా నోటికేదొస్తే అది అడ్డదిడ్డంగా మాట్లాడేస్తుంటే నెటిజన్లు ఊరుకుంటారా ? అందుకే లోకేష్ ను నెటిజన్లు ఓ రేంజిలో ఆటాడుకుంటున్నారు. అమరావతిని నిర్మిస్తే కెసియార్ తెలంగాణాకు తరలించుకుపోతారనేనా చంద్రబాబు కట్టనిది ? అంటూ ఫుల్లుగా ఆటాడేసుకుంటున్నారు.
