సారు..కారు.. సర్కార్ కాదు బేఖారులా తయారైందన్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటి చేస్తున్నారు. ఆయన శనివారం జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి తన ప్రచారాన్ని ప్రారంభించారు. కేంద్రంలో మోదీ-రాహుల్ మధ్యనే వార్ ఉంటుందని కేసీఆర్ అడ్రసే లేదన్నారు. కేంద్రంలో సారు..కారు..సర్కార్ అని టిఆర్ ఎస్ ప్రచారం చేస్తుందని అది సారు..కారు..బేఖారు లా తయారైందని ఎద్దేవా చేశారు. మీ కోసం వస్తున్నా.. మల్కాజ్ గిరి బిడ్డా మద్దతివ్వు అంటూ ఆయన పోస్టు చేశారు. రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్ లో ఉన్నారు.