హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

టిఆర్ఎస్ నేత హరీష్ రావు పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏమన్నారంటే…

“తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో టిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు మంత్రి వర్గంలో చోటు దక్కదు. ఎందుకంటే హరీష్ రావు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో హరీష్ రావు రహస్యంగా మాట్లాడారు. ఆ ఫోన్ రికార్డులను హరీష్ రావు పీఏనే స్వయంగా కేసీఆర్ కు అందజేశారు. హరీష్ రావుకు పదవి ఇవ్వక పోవడానికి ఇది ప్రధాన కారణం.

కేసీఆర్ కు తెలియకుండానే కొంత మంది నేతలకు హరీష్ రావు డబ్బులు సమకూర్చారు. మిడ్ మానేరు, తోటపల్లి, గౌరెల్లి ప్రాజెక్టుల్లో వెయ్యి కోట్ల రూపాయల పనులకు టెండర్లు లేకుండానే హరీష్ రావు కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. హరీష్ రావు మీద చర్యలు తీసుకుంటే తిరగబడే ప్రమాదముందన్న భయంతోనే కేసీఆర్ హరీష్ కు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపుతున్నాడు.

పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే హరీష్ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొని అవిశ్వాసం పెడతారని కేసీఆర్ కు భయం పట్టుకుంది. ఈ సారి కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, నాయిని నర్సింహ్మ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లకు మంత్రి పదవులు రావు.” అని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో టిఆర్ఎస్ లో కలవరం మొదలైంది.