కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు నో చెప్పడం అసలు కారణాలు ఏంటో తెలుసా?

2018 సంవత్సరంలో ముందస్తు ఎన్నికలపై తెగ ఆసక్తి చూపిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితమే కేసీఆర్ నిర్ణయాన్ని మార్చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో ఖర్చు చేసినా కేవలం పదివేల మెజారిటీ రావడంతో కేసీఆర్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతుండటం కూడా హాట్ టాపిక్ అవుతోంది. తెరాసకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావించి ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళితే నష్టమే తప్ప లాభం ఉండదని కేసీఆర్ కు అర్థమైంది.

అదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పరువు తీయాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నించగా అందుకు భిన్నంగా జరిగింది. బీజేపీ తప్పు చేసిందని ప్రూవ్ చేయాలని కేసీఆర్ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రాకుండా ప్రగతి భవన్ కు పరిమితం కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు తెరాస తప్పులను సరిదిద్దుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 2024 ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి తెరాస సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో తెరాసకు మరిన్ని షాకులు తగిలే ఛాన్స్ ఉందని కొత్త పథకాలను ప్రకటించడంతో పాటు ప్రజల్లోని వ్యతిరేకతను పోగొట్టుకునే దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేయాల్సి ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.