రేవంత్ రెడ్డికి 4+4 భద్రత ఓకే.. కానీ షరతులు వర్తిస్తాయి

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి 4+4 భద్రతతో పాటు, ఎస్కార్ట్ ను పోలీస్ శాఖ కల్పించింది. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో సిబ్బంది రేవంత్ నియోజకవర్గం కొడంగల్ చేరుకున్నారు.  ఎన్నికల ఫలితాల వరకు రేవంత్ సెక్యూరిటి కల్పించనున్నారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తనకు భద్రత కల్పించకుండా  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నారని రేవంత్ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. తనను మావోయిస్టుల పేరుతో హత్య చేసేందుకు కుట్ర పన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ రేవంత్ కు భద్ర కల్పించింది. 

రేవంత్ రెడ్డి తనకు భద్రత కల్పించాలని హైకోర్టులో పిటిషన్ వేయగా విచారించిన సింగిల్ బెంచ్ రేవంత్ కు 4+4 కేంద్ర బలగాల భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చింది. ఈ తీర్పును కేంద్రం అమలు చేయలేదు. రేవంత్ మళ్లీ పిటిషన్ వేయగా విచారించిన డివిజన్ బెంచ్ రేవంత్ కు కేంద్ర బలగాల భద్రత అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చింది. దీంతో రేవంత్ కు భద్రతగా ఎస్కార్టును,  గన్ మెన్లను పోలీస్ శాఖ పంపింది. రేవంత్ ప్రస్తుతం కొడంగల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. 

శుక్రవారం రేవంత్ రెడ్డి ఖమ్మం, మహబూబ్ నగర్ సభలల్లో ప్రచారాలకు వెళ్లాల్సి ఉండే కానీ రేవంత్ తనకు ప్రాణ భయం ఉంది అని ప్రచారాలను రద్దు చేసుకున్నారు. తనను మావోయిస్టుల మాటున చంపాలని కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. తనకు పూర్తి భద్రత కల్పించే వరకు కూడా తాను ప్రచారాలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో తనను తిరగకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే హైకోర్టు తీర్పునిచ్చింది. 

హైకోర్టు ఆదేశాల కాపీ వికారాబాద్ ఎస్పీకి అందింది. దీంతో వికారాబాద్ ఎస్సీ రేవంత్ కు ఎస్కార్ట్ వాహనాన్ని,  4+4 భద్రతను కొడంగల్ పంపించారు. వీరు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు రేవంత్ కు భద్రత కల్పించనున్నారు.