చెన్నూర్‌లో చిచ్చు, బాల్క సుమన్‌కు షాక్ (వీడియో)

మంచిర్యాల జిల్లా ఇంధారంలో ఉద్రిక్తత ఏర్పడింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల్క సుమన్ ను వ్యతిరేకిస్తూ ఇంధారంలో నల్లాల ఓదేలు అనుచరులు గ్యాస్ నూనె పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో ఇందారంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. బాల్క సుమన్ ఇంధారంలో ప్రచారం నిర్వహించేందుకు రాగా నల్లాల ఓదేలు అనుచరులు సుమన్ ను అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. ఇంతలో ఇద్దరు కార్యకర్తలు శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆ మంటలు పక్కనే ఉన్న మరో ముగ్గురు కార్యకర్తలకు అంటుకున్నాయి. దీంతో 5 గురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల ఆస్పత్రిలో వారికి చికిత్స కొనసాగుతుంది. గాయపడిన వారి వీడియో కింద ఉంది చూడండి.

 

MANCHIRYAL PROTEST