మహేశ్ బాబు,కేటీఆర్ ట్వీట్లు వైరల్!

మహేశ్ బాబు,కేటీఆర్ ట్వీట్లు వైరల్!

కేవలం సినిమాలే కాకుండా మహేష్ ఇతర విషయాలపైనా,ముఖ్యంగా క్రీడలపైనా ఆసక్తి చూపిస్తూంటారు మహేష్. అదే విధంగా రాజకీయాలపైనే కాకుండా కేటీఆర్ కూడా క్రీడలు,సినిమాలపై ఇంట్రస్ట్ చూపెడతారు. వాళ్ల ఇంట్రస్ట్ లను సోషల్ మీడియాలో తమ తమ అభిమాలతో షేర్ చేసుకుంటారు.

తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ పై వాళ్లు చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.ఇంగ్లాండ్ బౌండరీల నిబంధనతో కప్ సొంతం చేసుకోవటం విషయమై వీళ్లిద్దరూ తమదైన స్టైల్ లో ట్వీట్ చేసారు.

 ‘‘ఇప్పటికీ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మైకంలోనే ఉన్నా.. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ మాత్రం తప్పకుండా హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు’’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

వరల్డ్ కప్ ఫైనల్ విషయమై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఇంగ్లాండ్‌కు 12వ ఆటగాడిగా అదృష్టం కలిసొచ్చిందని ఆయన అన్నారు. కివీస్‌ను చూస్తుంటే బాధగా ఉందన్నారు. కేన్ విలియమ్సన్, కివీస్ జట్టు అద్భుతంగా ఆడిందన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ సమరం ఆదివారం లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరిగింది. అత్యంత రసవత్తరంగా సాగిన ఈ తుదిపోరులో ఇంగ్లండ్ జట్టు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఇంగ్లండ్ జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా పోరాటం చేయగా, న్యూజిలాండ్ ఆటగాళ్లు అంతకు రెట్టింపు స్థాయిలో పోరాడి ఓడిపోయారు.