ఉపాసన ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన కేటీఆర్

మెగా పవర్ స్టార్ రామ్ భార్య కొణిదెల ఉపాసన చేసిన ట్వీట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘మా టీమ్ స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు’ అంటూ కేటీఆర్.. ఉపాసన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎనకమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆమె అక్కడ ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఉపాసన ఇన్ఫర్మేషన్ అందించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలు ఇన్వెస్టర్లకు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఉపాసన వెల్లడించారు.

‘నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్‌ సర్‌? వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్‌ వెళ్లాను. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ‘ఇన్వెస్ట్‌‌ తెలంగాణ’‌ డెస్క్‌లో కూర్చున్నాను’ అని వెల్లడిస్తూ కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లను కలిశారు. అంతేకాదు ప్రపంచంలో అత్యాధునిక హెల్త్‌కేర్‌ వ్యవస్థలను ప్రారంభించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు వెల్లడించారు.