యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులంతా యాగాలు, స్వామిజీల బాటలు పడుతున్నారు. అసలే పూజల నమ్మకాలు ఎక్కువుండే సీఎం కేసీఆర్ శనివారం యాగంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో కేసీఆర్ యాగం నిర్వహించారు. చినజీయర్ స్వామి ఈ యాగాన్ని పర్యవేక్షించారు. కేసీఆర్ చినజీయర్ ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ గతంలో కూడా చండీ యాగం నిర్వహించారు. వాస్తును కూడా ఆయన ఎక్కువ నమ్ముతారు. నవంబర్ 14న ఆయన నామినేషన్ వేస్తుండడంతోనే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చర్చ జరుగుతోంది.  కేసీఆర్ యాగంలో పాల్గొన్న ఫోటో గ్యాలరీ కింద ఉంది చూడండి.