సిద్దిపేట విద్యార్దుల తల్లిదండ్రులకు హరీష్ రావు లేఖ

టిఆర్ఎస్ నేత హరీష్ రావు విద్యార్ధుల తల్లిదండ్రులకు లేఖ రాశారు. మార్చిలో పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్దులకు అండగా ఉండాలని కోరుతూ హరీష్ రావు తల్లిదండ్రులకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఏమన్నారంటే…

“ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల రోజుల సమయం విద్యార్ధులకు చాలా కీలకమైనది. వారి ముందు మీరు ఇంటి సమస్యలు చెప్పుకోవద్దు. తగువులాడుకోవద్దు. ఏదేని ఫంక్షన్లకు వెళ్లినా రోజుల పాటు వెళ్లకుండా వెంటనే వచ్చి వారికి అండగా ఉండండి. వారికి ఇంట్లో పనులు చెప్పకండి. వారు ప్రత్యేక తరగతులకు హజరయ్యేలా చూడండి. మంచి ఫలితాలు సాధించేలా చూడాలి” అని హరీష్ రావు కోరారు.

హరీష్ రావు రాసిన లేఖ ఇదే…