టిఆర్ఎస్ రాజయ్య 50 వేలు తీసుకున్నడు.. బెదిరించిండు (వీడియో)

స్టేషన్ ఘన్ పూర్ టిఆర్ఎస్ అభ్యర్ధి తాటికొండ రాజయ్య తమ వద్ద లంచం తీసుకున్నారని జాఫర్ గడ్ మండలానికి చెందిన యువకుడు, మాజీ ఎంపీటిసి సభ్యురాలు ఆరోపించారు. రాజయ్య పెద్ద అవినీతి పరుడని ఈ విషయాన్ని ప్రశ్నిస్తే తమను బెదిరింపులకు గురి చేశారన్నారు.

మండల ఆఫీసుల పనికి, మిషన్ భగీరథ పనికి, హాస్పిటల్  పనికి కలిపి 50 వేల రూపాయలు లంచం తీసుకున్నారని వారు ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నిస్తే రాజయ్య పిఏ తమకు ఫోన్ చేసి అంతు చూస్తానని బెదిరించాడన్నారు. తమతో పాటు తమ స్నేహితుల వద్ద కూడా 50 వేల రూపాయలు తీసుకున్నాడని వారు ఆరోపించారు. వారు మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

Trs Rajaiah victim