షర్మిల నోట ‘జై తెలంగాణ’ మాట .. టార్గెట్ ఆ పార్టీయేనా ?

YS Sharmila did blender mistake  

తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు షర్మిల కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని వైఎస్సార్‌‌ అభిమానులతో షర్మిల స‌మావేశాలు కొనసాగుతున్నాయి. త్వ‌ర‌లో పార్టీ షర్మిల ప్రారంభించ‌నున్నారు. అందులో భాగంగానే ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలతో ఆమె భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చ‌ర్చ‌లు జరుపుతున్నారు.లోటస్ ‌పాండ్‌లో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 500 మంది దాకా కార్యకర్తలు హాజరయ్యారు.

అయితే ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించినట్లు సమాచారం. తెలంగాణలో కొత్త రాజకీయ‌ పార్టీ పెట్టాల‌ని వైఎస్ ష‌ర్మిల భావిస్తున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైఎస్సార్ అభిమానుల‌తో ఆమె సమావేశాలు కొన‌సాగిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో షర్మిల ఈ రోజు భేటీ అయ్యారు. తెలంగాణ‌లో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాల‌పై వారితో భవిష్యత్ కార్యాచరణపై ష‌ర్మిల‌ చర్చిస్తున్నారు.

ఈ సందర్భంగా షర్మిల ఒక్కసారి ఈ నినాదం ఇవ్వడంతో అభిమానులు ఉబ్బితబ్బిబయ్యారు. తెలంగాణలో బలమైన ముద్ర వేయాలనే షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఆమె జై తెలంగాణ అనడంతో పక్కగా అధికార పార్టీపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.కొన్ని రోజులుగా ఆమె జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్నారు. నిన్న కూడా షర్మిల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నేత‌ల‌తో త్వ‌ర‌లో రెండో విడ‌త చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. తెలంగాణ‌లో జిల్లాల వారీగా ఆమె వైఎస్ అభిమానుల‌తో స‌మావేశం అవుతున్నారు.