Ayushmann Khurrana: ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లో తెలుసా?

Ayushmann Khurrana: ముంబై లో ఇల్లు కొనుగోలు చేయాలనే కళ ఎంతోమంది సెలబ్రిటీలకు ఉంటుంది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు వారి కలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే గత ఏడాది సన్నీ లియోన్, అజయ్ దేవగన్, అర్జున్ కపూర్ వంటి పలువురు ముంబైలో అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలోనే మరో యంగ్ హీరో ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.

బీ టౌన్ సమాచారం ప్రకారం ఆయుష్మాన్‌ ఖురానా, అతడి సోదరుడు అపరశక్తి ఇద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్ లో రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. విండ్సర్‌ రియల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రెండు అపార్ట్‌మెంట్లను ఈ హీరోలు తమ పేరును రాయించుకున్నట్లు తెలుస్తోంది. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని విండ్సర్‌ గ్రాండే రెసిడెన్స్‌ 20వ ఫ్లోర్‌లో ఉన్న ఈ రెండు అపార్ట్‌మెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నవంబర్ 29వ తేదీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

4,027 చదరపు అడుగులతో ఎంతో విశాల వంతంగా ఉన్న ఈ ఫ్లాట్ లో ఏకంగా నాలుగు కార్ల పార్కింగ్ సౌకర్యంగా ఉందని, ఎంతో విలాసవంతమైన ఈ భవనాన్ని ఆయుష్మాన్‌ రూ.19.30 కోట్లు చెల్లించాడట. స్టాంప్‌ డ్యూటీ కింద రూ.96.50 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు హీరోలు గతంలో కూడా 9 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని చండీగఢ్‌లోని పాంచ్‌కులలో కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.