CM KCR: యాదాద్రి దర్శన ప్రారంభోత్సవం.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కేసీఆర్!

CM KCR: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గుడి నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా స్వయంభు దర్శన ఏర్పాట్లు కూడా జరుగుతుంది. దీంతో ఈ కార్యక్రమం కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనగా.. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు.

ఆయనకు కంకణధారణ చేసి ఆశీర్వచనం అందించారు పండితులు. ఏడు గోపురాలపై ఉన్న కలశాలకు ఒకేసారి కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధానాలయం ప్రవేశం ఉంటుందని తెలిసింది. ఉపాలయాల్లోని ప్రతిష్ట మూర్తులకు మహా ప్రాణన్యాసం చేసిన తర్వాత ఆరాధన సంప్రోక్షణ అనంతరం గర్భాలయంలో స్వయంభువుల దర్శనం ప్రారంభమవుతుంది. మొత్తానికి యాదాద్రి స్వయంభు దర్శన ప్రారంభోత్సవం ప్రారంభమైనట్లే.