Anjanamma: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనదేవి ఉన్నఫలంగా తీవ్ర అస్వస్థతకు గురి అయినట్టు తెలుస్తోంది. ఈమె నేడు ఉదయం అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న అంజనాదేవి చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే తన ఇంట్లో తన కొడుకులు ఎవరూ లేని సమయంలో ఈమె ఆస్వస్థతకు గురి కావడంతో మెగా కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది . అయితే తన తల్లి అనారోగ్యానికి గురయ్యారు అనే విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉండగా వాటన్నింటిని వాయిదా వేసుకుని హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు చిరంజీవి సురేఖ దంపతులు కూడా ఇండియాలో లేరనే తెలుస్తుంది వీరిద్దరూ తమ 45వ పెళ్లి సందర్భంగా దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే తన తల్లి పరిస్థితి గురించి ఆరా తీయటమే కాకుండా దుబాయ్ నుంచి వెంటనే తిరిగి ఇండియాకి బయలుదేరినట్టు సమాచారం.
ఇక ప్రస్తుతం అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఎందుకు ఆమె ఉన్న ఫలంగా అస్వస్థతకు గురి అయ్యారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఇటీవలే ఈమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
