వనపర్తికి కేసీఆర్.. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాన్ని మెుదలుపెట్టనుంది. ‘మన ఊరు- మనబడి, మనబస్తీ- మనబడి’ పేరుతో  వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేందుకు మనఊరు-మనబడి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్కారీ బళ్లలో ఆంగ్లమాధ్యమ విద్యాబోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం కింద రూ.7,289 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్ని దశలవారీగా అభివృద్ధి చేస్తారు.