అప్పుడు 23 సీట్లయినా ఇచ్చారు ప్రజలు.. ఈసారి టీడీపీ భూస్థాపితమే.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

Vijayasai reddy fires on tdp president chandrababu

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోనీలే పాపం అని ఏపీ ప్రజలు టీడీపీ పార్టీకి 23 సీట్లు ఇచ్చారు. 23 సీట్లలో టీడీపీని గెలిపించారు. ఈసారి మాత్రం అది కూడా ఉండదు. టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Vijayasai reddy fires on tdp president chandrababu
Vijayasai reddy fires on tdp president chandrababu

అంతర్వేది ఆలయం రథం దగ్ధం ఘటన చాలా బాధాకరమని.. ఆ ఘటన వెనుక ఖచ్చితంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరులు ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఆ ఘటన వెనుక పెద్ద కుట్ర జరిగిందని తెలిసే.. సీబీఐ విచారణను తమ ప్రభుత్వం కోరిందని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని… దోషులెవరైనా వదిలేది లేదని.. దీని వెనుక ఉన్న కుట్రను కూడా ఛేదించాలని ఆయన అన్నారు.

విశాఖ పట్టణంలో మన చేతుల్లో మన ఆరోగ్యం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మట్లాడారు. ఈ పుస్తకాన్ని కరోనా నుంచి కోలుకున్న తర్వాత తన అనుభవాలను ఆ పుస్తకంలో విజయసాయిరెడ్డి రాశారు. ఈ పుస్తకాన్ని మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు.

vijayasai reddy and minister muthamshetti launch book
vijayasai reddy and minister muthamshetti launch book

ఈ ఘటనలో హైదరాబాద్, గుంటూరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు ఇప్పటికే అనుమానిస్తున్నారు. పెదబాబు, చినబాబు హస్తం ఉందనే విషయం విచారణలో ఖచ్చితంగా బయటపడుతుంది. చంద్రబాబు ప్రవాసాంధ్రుడిలాగా హైదరాబాద్ లో ఉంటారు. ఏపీలో అల్లర్లు సృష్టిస్తుంటారు. బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీ ట్రాప్ లో పడిపోయి.. మత రాజకీయాలను సృష్టిస్తున్నారు.

కొన్ని రోజులు ఆగితే సీబీఐ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. హిందూ ద్రోహులు ఎవరు అనేది స్పష్టం అవుతంది.. అని విజయసాయిరెడ్డి తెలిపారు.