జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుబి.. ఇప్పటి వరకు 53 స్థానాల్లో విజయం?

trs party winning in ghmc elections

నో డౌట్.. ఈసారి కూడా జీహెచ్ఎంసీ మేయర్ పదవి టీఆర్ఎస్ కే. టీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి మోగిస్తోంది. ఇప్పటి వరకు 53 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే.. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పార్టీ బీజేపీ. ఎందుకంటే.. గత ఎన్నికలతో పోల్చితే.. బీజేపీ ఈసారి బాగా పుంజుకుంది అని చెప్పుకోవచ్చు.

trs party winning in ghmc elections
trs party winning in ghmc elections

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం… టీఆర్ఎస్ పార్టీ 53 స్థానాల్లో గెలుపొంది… మరో 6 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంఐఎం పార్టీ 41 స్థానాల్లో గెలవగా… ఒక్క స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది. ఇక.. బీజేపీ పార్టీ ఇప్పటికే 41 స్థానాల్లో గెలుపొందగా… 8 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో గెలుపొందింది. ఏఎస్ రావు నగర్, ఉప్పల్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.