Nagarjuna: అద్భుతమైన కథతో ఓటీటీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ కింగ్?

Nagarjuna: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఓటీటీలకు మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎంతో మంది థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం కన్నా ఇంట్లోనే చాలా సేఫ్ గా ఉంటూ ఓటీటీలో సినిమాలు చూడటం మంచిదని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే డిజిటల్ మీడియాకు అత్యంత ప్రేక్షకాదరణ పెరిగింది. ఈ విధంగా డిజిటల్ మీడియాకి వస్తున్న ఆదరణ చూసి స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు పలు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జాబితాలోకి మరొక సీనియర్ హీరో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒక మెస్మరైజింగ్ కథతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున హీరోగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుందని సమాచారం.

నాగార్జున హీరోగా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో న్యూ ఏజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ వెబ్ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే బంగార్రాజు చిత్రం ద్వారా మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న నాగార్జున వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.