Nagarjuna: ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ హీరో నాగార్జున?

Nagarjuna: ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాలను చూడడానికి థియేటర్లకు రావడానికి అంతగా మొగ్గుచూపడం లేదు. సినిమాను థియేటర్ లలో చూసే ప్రేక్షకుల కంటే ఓటీటీ లో చూసే ప్రేక్షకులు ఎక్కువ అయ్యారు. దీనితో థియేటర్ లతో పోల్చుకుంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కీ రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతోంది. దీనితో స్టార్ సెలబ్రిటీలు సైతం వారు నటించిన సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రెటీలు షోల ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను అలరించారు.

ఇప్పటికే ఈ లిస్టులో ఎంతో మంది సెలబ్రెటీలు జాయిన్ అయ్యారు. అయితే తాజాగా ఈ జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు సీనియర్ హీరో నాగార్జున. హీరో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఓటిటి కోసం ఏమి నిర్మించడం లేదు. కానీ ఏకంగా హీరో నాగార్జున ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవ్వబోతున్న ఒక వెబ్ సిరీస్ లో హీరో నాగార్జున నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అని తెలుస్తోంది.న్యూ ఏజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ గురించి
మరింత సమాచారం త్వరలోనే అధికారికంగా ప్రకటన విలువడాల్సి ఉంది.

ఇక మరొకవైపు బిగ్ బాస్ సీజన్ 6 కూడా ఓటీటీ లో విడుదల కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ బంగారు రాజు సినిమా లో నాగార్జునతో పాటు తనయుడు నాగ చైతన్య నటించిన విషయం తెలిసిందే.మరి హీరో నాగార్జున ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తారో తెలియాలంటే వేచిచూడాల్సిందే మరి.