ఎలక్షన్ తరవాత చంద్రబాబు కి ఒకే ఒక్క గుడ్ న్యూస్ ఇది !

Chandrababu naidu

 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కదిలిస్తే చాలు హైదరాబాద్ ను నేను నిర్మించాను, హైటెక్ సిటీని నేనే కట్టించాను , నేను లేకపోతే హైదరాబాద్ మహా నగరం లేదన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు, తాజాగా భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జెనోమ్ వ్యాలీని సంద‌ర్శించిన సమయంలో జెనోమ్ వ్యాలీకి తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకొని పొంగిపోయాడు చంద్రబాబు నాయుడు.

Chandrababu naidu

 మూడు ద‌శాబ్దాల క్రితం నా విజ‌న్ నేడు నిజ‌మైంద‌ని, నేను పునాది వేసిన జెనోమ్‌వ్యాలీలో భార‌త్ బ‌యోటెక్ కంపెనీ క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ త‌యారు చేయ‌డం నా క‌ల‌ల ప్రాజెక్టు ఫ‌లించింద‌నేందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. దేశంలో బ‌యోటెక్ అనే ప‌దం కొత్త‌గా వినిపిస్తున్న 1990 రోజుల‌లో హైద‌రాబాద్‌లో జెనోమ్ వ్యాలీకి అంకురార్ప‌ర‌ణ చేశామ‌ని, ఇప్పుడు అందులో 150కిపైగా ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత లైఫ్ సైన్సెస్‌ కంపెనీలు రిసెర్చ్ అండ్ డెవ‌ల‌జ్‌మెంట్ విభాగాల‌ను నిర్వ‌హిస్తూ జెనోమ్ వ్యాలీ బ‌యోటెక్ హ‌బ్‌గా మారిందని,క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాక్సిన్ త‌యారీకి జెనోమ్ వ్యాలీ కేంద్రం కావ‌డం, దూర‌దృష్టితో చేసే ప‌నులు భావిత‌రాల‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయో మ‌రోసారి నిరూపించింద‌న్నారు.

 వైద్యారోగ్య అవ‌స‌రాలు తీర్చే జెనోమ్ వ్యాలీలో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయ‌ని, మౌలిక వ‌స‌తుల‌కు క‌ల్ప‌న‌కు కృషి చేస్తున్నాయ‌ని చెప్పారు. అయితే హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు నిర్మించాడా..? లేడా అనే విషయాన్ని పక్కన పెడితే జెనోమ్ వ్యాలీ విషయంలో మాత్రం క్రెడిట్ బాబుకు ఇవ్వాల్సిందే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జెనోమ్ వ్యాలీ కు శంకుస్థాపన జరిగింది కాబట్టి ఈ విషయంలో ఎవరు బాబు మాటలను డాబు కోసం చెప్పాడని అనుకోవటానికి లేదు.

 ఈ వయస్సులో బాబుగారికి కూడా కావాల్సింది ఇలాంటి మాటలే. ఆంధ్రాలో పార్టీని ఎలా ముందుకు నడపాలో తెలియక కింద మీద అవుతున్నాడు, ఇటు తెలంగాణాలో చూస్తే పార్టీ ఉందొ లేదో కూడా తెలియటం , ఇక గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఓడిపోతామని తెలిసిన పొడిచేస్తున్నాడు. ఆ ఓటమి తర్వాత కొంచం మనోదైర్యానికి ఇలాంటి మాటలు అవసరమే