CM Chandrababu To Visit Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీలు మరియు పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఆయన ఈ సాయంత్రం హస్తినకు పయనమవుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం 7:20 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రి 9:35 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ఆయన, రాత్రికి తన అధికారిక నివాసం 1-జన్పథ్లో బస చేస్తారు. రేపు (మంగళవారం) ఉదయం నుంచి సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించనున్నారు.
అమిత్ షా (కేంద్ర హోం మంత్రి) రాష్ట్రానికి సంబంధించిన కీలక రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు.
నిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక మంత్రి) కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరనున్నారు. అలాగే, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంక్ రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ గ్రాంట్లపై చర్చించనున్నారు.

సీఆర్ పాటిల్ (కేంద్ర జలశక్తి మంత్రి) పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిల విడుదల, పునరావాస (R&R) ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు.
ఈ నెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సాంకేతిక అంశాలు, పెట్టుబడులు మరియు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు.
రేపు సాయంత్రం అంతా ముగించుకుని 5:00 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి, రాత్రి 8:00 గంటల ప్రాంతంలో తిరిగి విజయవాడ చేరుకుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా సీఎం చేస్తున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

