వైఎస్ జగన్ సర్కార్ మీదకు వీర విహారం చేయడానికి సింహన్ని తయారు చేస్తున్న చంద్రబాబు.. ?

YS Jagan should concentrate on development  

 

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది ఎంత పెద్ద టాక్ అయ్యిందో.. వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి ప్రస్తుతం చంద్రబాబు ఏం ప్లాన్ వేస్తున్నాడు అనేది కూడా ఏపీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారిందట.. ఇప్పటికే ఎక్కడి పార్ట్స్ అక్కడ ఊడిపోయి ఉన్న టీడీపీని రీపేరింగ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు ఈ మధ్యకాలంలో పచ్చ చొక్కాలో జోష్ పెరగడానికి తన బుర్రకు పదును పెడుతున్నాడట.. ఈ నేపధ్యంలో ఎన్నో జిమ్మిక్కులు చేస్తూ పదవులు పంచుతున్నారట.. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చే పదవుల కోసం కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడట.. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు ను కూడా తెరమీదికి తీసుకొస్తున్నాడట.. అదీ అట్లా ఇట్లా కాదట.. తన రాజకీయ కుతంత్రాలను ఉపయోగించి వైఎస్ జగన్ సర్కార్ మీదకు వీర విహారం చేయడానికి అచ్చెన్నాయుడు అనే సింహన్ని తయారు చేస్తున్నాడట.

ఇదిలా ఉండగా మూడు నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నా అచ్చెన్నాయుడు బెయిల్ మీద వచ్చిన తరువాత అయినా పెదవి తెరుస్తాడని ఆశించారు.. కానీ ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు. మరి ఈ మౌనం వెనక ఏదో వ్యూహం ఉందని అంటున్నారు. ఇలా కొన్నాళ్ళు తెర వెనక ఉండి ఒక్కసారిగా రంగంలోకి దూకితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. జనాల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఈ స్ట్రాటజీ ప్రకారం నడుచుకుంటున్న అచ్చెన్నాయుడు మీడియాను కూడా పూర్తిగా దూరం పెట్టారు.

సరిగ్గా ఇప్పుడే చంద్రబాబు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని ఖాయం చేశారు. ఆ విషయాన్ని విజయదశమి రోజున ప్రకటిస్తారట. ఆ మీదట ఆయన నోరు విప్పుతారట. మరి ఆయన పెదవి విప్పితే డైనమేట్లే పేలుతాయనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఇక ఇంతకాలం మౌనంగా ఉన్న అచ్చెన్నాయుడు సరైన సమయంలో సింహంలా వీర విహారం చేస్తారు అని అంటున్నారు. మరి ఇది అచ్చెన్న సొంత ప్లానా లేక చంద్రబాబు డైరెక్షనా అన్నది తెలియడం లేదు. మరి అచ్చెన్న గర్జనలకు వైసీపీ కంపిస్తుందా లేక ధీటుగా ఎదుర్కొంటుందా అన్నది కొద్దిరోజుల్లో తేలిపోనుందట..