Sai Pallavi: నేచురల్ బ్యూటీగా ఫిదా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరిని ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఆచితూచి కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటుంది.ఈ క్రమంలోనే సాయిపల్లవి నటించిన సినిమాలు అంటే అభిమానులకు కూడా ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇలా తాజాగా సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా ద్వారా ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 24వ తేదీ సాయి పల్లవి నాని జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సాయిపల్లవి వేదికపై ఒక్కసారిగా ఏడ్చిన సంగతి మనకు తెలిసిందే.bఅయితే ఆమె అలా ఏడవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. అసలు సాయి పల్లవి ఫ్రీ రిలీజ్ వేదికపై ఏడవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఓ కళారూపంలో కొనసాగుతూ అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడమే నిజమైన అచీవ్మెంట్గా నేను భావిస్తానని సాయి పల్లవి తెలిపారు.
అదే విధంగా తనకు నటనా,డాన్స్ లలో పెద్దగా అనుభవం లేదని తనకు తెలిసిన కల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నానంటే ఇది నాకు దేవుడిచ్చిన ఒక వరం అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరు నాపై చూపిస్తున్న అభిమానం కళ్ళారా చూడగానే తనకు కన్నీళ్లు ఆగలేదని అందుకోసమే వేడుకలో కన్నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా సాయి పల్లవి అసలు విషయం బయట పెట్టారు.
