అప్పటి కేసీఆర్ కు ఇప్పటి కేసీఆర్ కు చాలా తేడా ఉంది: ఈటెల రాజేందర్

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సిద్ధిపేటలో నిర్వహించిన మోదీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ కేసీఆర్ గురించి పలు విమర్శల వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కేసీఆర్ కు ఇప్పుడున్న కేసీఆర్ కు చాలా తేడా ఉంది అని అన్నారు.

ఇక తన పార్టీ మారలేదు అని.. టీఆర్ఎస్ వాళ్ళే తనను వెళ్లగొట్టారు అని.. పదవుల కోసం పెదాలను మూసే దద్దమ్మలు తెరాస నేతలు అని అన్నారు. కేసీఆర్ కు గోలీలు ఇచ్చేందుకు సంతోష్ కు రాజ్యసభ పదవి ఇచ్చారు అని.. సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అని అనడం ప్రజలను అవమానించడమే అవుతుంది అంటూ విమర్శలు చేశారు.