Actress Krishnaveni: నా భర్త చావుకు కారణం ఆ హీరోయిన్ … షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కృష్ణవేణి!

Actress Krishnaveni: నటి కృష్ణవేణి 43సంవత్సరాల కెరీర్ లో హీరోయిన్ గా, సహాయక నటి గా, కమెడియన్ గా ఎన్నో పత్రాలు పోషించి మెప్పించారు. 200పైగా సినిమాల్లో నటించిన ఆమె మొదటి సినిమా వారాలబ్బాయ్ డైరెక్టర్ రాజచంద్రను వివాహం చేసుకున్నారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన సినిమా ప్రయాణంలోని కష్టాలను ఒడిదుడుకులను చెప్పుకున్నారు. ఈ ఇంటర్వ్యూలోనే తన భర్త మరణం వెనుక రహస్యాలు వెల్లడించి సంచలనం రేపారు.

తను వివాహం చేసుకునే సమయానికి తన భర్త రాజా చంద్రకు వివాహమై నలుగురు సంతానం ఉన్నారని, నలుపంటే నచ్చక పోయినా నల్లగా ఉన్న రాజచంద్రను తాను వివాహం చేసుకున్నానని తెలిపారు. వివాహం చేసుకునే సమయానికి తన భర్త అతని కుటుంబం చాలా పేదరికంలో ఉన్నారని అయన నిలదొక్కుకుని డైరెక్టర్ గా సక్సెస్ అయ్యే సమయానికి మరణించారని చెప్పారు.
అలాగే అయన మరణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాజా చంద్ర ది సహజ మరణం కాదని కరెంటు వైర్ తో కాల్చి పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపారాని వాపోయారు. రాజచంద్ర తీసిన చాలా సినిమాలు 100రోజులు ఆడటంతో డైరెక్టర్ గా టాప్ ప్లేస్ కి వెళ్తారని ఓర్వలేని వాళ్ళు ఈ పని చేసారని చెప్పారు. పోలీస్ లకు అన్ని తెలిసిన తామేమి చేయలేమన్నారని తెలిపారు. ఈ పని చేయించిన నాటి హీరోయిన్ ప్రస్తుతం మరణించారాని చెప్పుకొచ్చారు కానీ ఆ హీరోయిన్ పేరు మాత్రం బయట పెట్టలేదు. బాంబులు వేసి ఇంటిని పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో రెండు సంవత్సరాలు పోలీసులు కాపలా ఉన్నారని తన వ్యక్తిగత రహస్యలను వెల్లడించారు.