KCR: దేశానికి ఆదర్శ రాష్ట్రంగా మారనున్న తెలంగాణ: కేసీఆర్

KCR: ఈ రోజు ఉగాది సందర్భంగా ప్రగతి భవన్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో కేసీఆర్ మాట్లాడుతూ.. అందరికీ శుభ కృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని కోరాడు. ఇక ఈ రాష్ట్రంలో అనేక విషయాలలో అద్భుతాలు జరిగాయని.. విద్య, విద్యుత్, తలసరి ఆదాయంలో మంచి ఫలితాలు సాధించామని తెలిపాడు.

అంతే కాకుండా తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని.. రాష్ట్రంలో మారుమూల గ్రామానికి వెళ్లినా కూడా భూమి ధర పెరిగిందని అన్నాడు. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి వల్లే ఇదంతా జరిగిందని.. దళిత బంధు పథకం, మరెన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తుందని అన్నాడు. ఇక దేశానికే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారుతోందని అన్నాడు.