తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ వరుసబెట్టి చేస్తున్న ఆందోళనలపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఆందోళనలపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ స్పందించిన హైకోర్టు బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ అనుమతులు లేకుండా జరిగిన ఆందోళనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తెలంగాణ హోం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.