గోరంట్ల మాధవ్ వల్ల టీడీపీ పరువే పోతుందా.. దొందూ దొందే అంటూ?

గోరంట్ల మాధవ్ వీడియో వల్ల వైసీపీ పరువు పోయిందనే సంగతి తెలిసిందే. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లో ఆ వీడియో నిజం అని తేలినా ఫేక్ అని తేలినా వైసీపీకి నష్టమే తప్ప లాభం ఉండదు. వైసీపీ నేతలు సైతం ఆ వీడియో గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదు. అయితే ప్రస్తుతం గోరంట్ల మాధవ్ వీడియో గురించి విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు తమ పరువును పోగొట్టుకుంటున్నారు.

గోరంట్ల మాధవ్ వీడియొ గురించి పదేపదే టీడీపీ నేతలు విమర్శలు చేయడంతో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఘటనల గురించి వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ ఎవరూ తక్కువ కాదని దొందూ దొందే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోరంట్ల మాధవ్ పరువు తీయాలని ప్రయత్నించి టీడీపీ నేతలు తమ పరువే పోగొట్టుకుంటున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.

రాజకీయ నేతలలో ఎవరూ తక్కువ కాదని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఏపీలోని పార్టీల పరువును అన్ని పార్టీలు తీసుకుంటున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో విమర్శలు ఎదుర్కొంటున్న నేతలే గోరంట్ల మాధవ్ గురించి అసభ్యంగా మాట్లాడటం గమనార్హం. మాధవ్ ఎపిసోడ్ లో టీడీపీ ఒక విధంగా ఫెయిల్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మాధవ్ వీడియో నిజమో కాదో తెలియాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదని మాధవ్ మాట్లాడిన మహిళ ఎవరో తెలిస్తే చాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. వీడియోను లీక్ చేసిన వాళ్లు మహిళను కనిపెట్టడం ఆ మహిళ గురించి బయటపెట్టడం కష్టం కాదనే సంగతి తెలిసిందే. ఆ మహిళే గోరంట్ల మాధవ్ గురించి ఫిర్యాదు చేస్తే అప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.