NTR – Mahesh Babu: మహేష్ కోసం ప్రార్థించిన తారక్.. త్వరగా కోలుకోవాలి అన్నా అంటూ ట్వీట్!

NTR – Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు స్పందిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డానని,ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని తనని కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇలా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు.

ఇక తమ అభిమాన నటుడు మహేష్ బాబుకు కరోనా అని తెలియడంతో అభిమానులు, ఇతర సెలబ్రిటీలు సైతం కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఆరోగ్య విషయంపై ఎన్టీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలియజేస్తూ… కరోనా నుంచి త్వరగా కోలుకో అన్నా.. నీ ఆరోగ్యం కోసం దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేష్ బాబు కోసం ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇద్దరు హీరోల అభిమానులలో ఎంతో సంతోషం తీసుకువచ్చింది. ఇకపోతే తాజాగా వీరిద్దరూ ఎన్టీఆర్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక గత ఏడాది ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సమయంలో మహేష్ కూడా స్పందిస్తూ అనారోగ్యం నుంచి కోలుకోవాలని ట్వీట్ చేయడం గమనార్హం. అయితే నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మహేష్ బాబు దుబాయ్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే దుబాయ్ లో మహేష్ బాబు కరోనా బారిన పడి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.