Krithi shetty: ఏడాది పూర్తి చేసుకున్న ఉప్పెన… మరో పుట్టినరోజు అంటూ బేబమ్మ పోస్ట్!

Krithi shetty: బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరి 12 వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా హీరో హీరోయిన్ కి డెబ్యూ మూవీ కావడం విశేషం.ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృతి శెట్టి ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలయ్యే నిన్నటితో ఏడాది పూర్తి కావడంతో ఈ సినిమా గురించి హీరోయిన్ కృతి శెట్టి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కృతి సోషల్ మీడియా వేదికగా ఉప్పెన సినిమాకు ఒక సంవత్సరం పూర్తి అయ్యింది.మన జీవితంలో రెండు పుట్టిన రోజులు ఉంటాయి. ఒకటి మనం పుట్టినరోజు కాగా రెండవది మన జీవితంలో మనం ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకునే రోజు రెండవ పుట్టినరోజుగా జరుపు కుంటారు.నా కెరియర్ ప్రారంభమై నేటితో ఒక సంవత్సరం పూర్తి కావడంతో ఈ రోజు నేను నా రెండవ పుట్టినరోజుగా జరుపుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు.

ఈ ఏడాది నన్ను ఎంతో ఆప్యాయంగా స్వీకరించింది అందుకే ప్రస్తుతం నేను నాకు ఇష్టమైన పనిని ఎంతో సంతోషంగా చేస్తున్నాను అంటూ తన సినీ కెరీర్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక గత ఏడాది ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి శెట్టి గత ఏడాది చివరిలో నాని సరసన శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది మొదట్లో బంగార్రాజు చిత్రం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఏడాది మొదట్లోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.