సుడిగాలి సుధీర్ టీమ్ కష్ట పడకపోయినా హిట్ అవుతారు…మా స్కిట్ మాత్రం ఫట్?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది జబర్దస్త్ కామెడీ జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నారు. జబర్దస్త్ ద్వారా పాపులరైన ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ జబర్దస్త్ ని వీడకుండా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.అందుకు ఒక ముఖ్య కారణం హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటివారు జబర్దస్త్ లో కనిపించకపోవడమే.

గత కొంతకాలంగా ఆది, సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ లో కనిపించడం లేదు. వీరు జబర్దస్త్ లో కనిపించకుండా పోవడానికి ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి. కొందరు రెమ్యూనరేషన్ తక్కువగా ఉండటం వల్ల జబర్దస్త్ కి దూరంగా ఉన్నారని అంటుంటే.. మరికొందరు మాత్రం మల్లెమాల వారితో మనస్పర్ధలు రావడం వల్లే మీరు జబర్దస్త్ కి దూరంగా ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాకేష్ సుడిగాలి సుధీర్ టీమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. జబర్దస్త్ లో సుధీర్, శ్రీను, ప్రసాద్ ఎన్నో ఏళ్లుగా ఓకే టీంలో కొనసాగుతున్నారు. సుడిగాలి సుధీర్ టీంకి ఇతర టీంకి మధ్య ఉన్న తేడా గురించి రాకేష్ మాట్లాడుతూ.. వీరు ముగ్గురు స్టేజ్ పైకి వస్తే చాలు వారి హావభావాలతోనే ప్రేక్షకులను నవ్విస్తారు. వారి ముగ్గురికి అది దేవుడిచ్చిన వరం. కానీ ఇతర టీమ్ మెంబర్స్ మాత్రం స్క్రిప్ట్ రాసుకొని రాత్రిపగలు ప్రాక్టీస్ చేసి పంచ్ లు రెడీ చేసుకొని ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు ఇవన్నీ చేయకపోయినా కూడా వారికి కలిసొస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.