Soundarya: సౌందర్య చనిపోయే వారం ముందే ఆమెకు సంకేతాలు వచ్చాయి.. మానవ కోటేశ్వరరావ్ షాకింగ్ కామెంట్స్!

Soundarya: హీరోయిన్ సౌందర్య చివరి మూవీ శివశంకర్ అని, దానికి సంబంధించి ఆమె అన్నపూర్ణ స్టూడియోస్‌లో హాస్పిటల్ సెట్ వేశారని, అక్కడ ఆమె సోఫాలో కూర్చొని ఉండగా, పైన లైట్‌మెన్ వాళ్లు నడవడానికి నిచ్చెనలాంటిది ఏర్పాటు చేశారని, దాని కింద ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కప్పబడి ఉంటుందని ఆర్టిస్ట్ మానవ కోటేశ్వర్ రావు తెలిపారు. అలా ఏర్పాటు చేసినపుడు ఎక్కడైతే ఆ బద్దలు పెట్టారో అక్కడ కాలు పెట్టి లైట్‌మెన్స్ నడవాలి. కానీ అతను కాలును మధ్యలో వేసేసరికి ఒక రకమైన శబ్దం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సౌండ్‌కు సౌందర్య గారు లేచి నిలబడ్డారని, ఆ కాలు వేసిన వ్యక్తి ఆమె ముందే పడిపోయాడని ఆయన తెలిపారు. అది దాదాపు 15 ఫీట్‌ ఎత్తు ఉందని, కొంచెం మిస్‌ అయితే ఆమె మీద పడేదని ఆయన చెప్పారు. కింద పడ్డ అతనికి కొంచెం గాయాలయ్యాయని ఆయన అన్నారు.

అలా జరిగిన 2,3 రోజులకే సౌందర్య చనిపోయారని కోటేశ్వర్‌ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాంటి సంఘటనలు ఆ 2,3 రోజుల్లో కొన్ని జరిగాయని ఇప్పటికీ తెలిసిన వారు చెబుతారని ఆయన అన్నారు. అది కూడా ఆమెకు ఆపద కలగబోతుంది అనే దానికి చిహ్నంగా తోచిందని ఆయన చెప్పారు.

ఇకపోతే తాను ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న సీన్లు చేస్తున్నపుడు కొన్ని డైలాగ్స్ చెప్పాలంటే ఇబ్బందిగా జరిగేదని ఆయన అన్నారు. క్రష్‌ సినిమాలో ఒక డైలాగ్‌ చెప్తున్నపుడు అలాంటి సిచ్యువేషన్‌ను ఎదుర్కొన్నానని, దానికి చాలా టైం తీసుకున్నానని ఆయన అన్నారు. దాంతోపాటు మనసారా సినిమాలోనూ అలాంటి ఘటనే ఎదురైందని ఆయన చెప్పారు. ఆ ఒక్క సీన్ చేయడానికి కనీసం ఆఫ్ డే పట్టిందని ఆయన స్పష్టం చేశారు.