ఆస్తి కోసం కన్నతల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించిన కొడుకు.. కన్నీటిపర్యంతమైన తల్లి!

ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా అంతరించిపోతున్నాయి.ఏమాత్రం తల్లీబిడ్డలు అన్నాచెల్లెళ్లకు అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలు లేవనే చెప్పాలి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బుపై వ్యామోహంతో డబ్బు కోసం ఆరాటపడుతున్నారు తప్ప కుటుంబ విలువలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలకు గౌరవం ఇవ్వడం లేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్తి కోసం కన్న బిడ్డల నైనా తల్లిదండ్రుల నైనా చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఈ క్రమంలోనే ఆస్తి కోసం కన్నతల్లి పట్ల ఒక కొడుకు ఎంతో అమానుషంగా ప్రవర్తించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మునిసిపల్ చైర్మన్ ఇంట్లో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.ఎంతో బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కేవలం ఆస్తి కోసం తన తల్లి పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రఘు తన తల్లి సరోజమ్మ కూడా 25 వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందారు.ఇలా ఇద్దరు మంచి స్థానంలో ఉన్నప్పటికీ రఘు గత మూడు నెలల నుంచి ఆస్తి కోసం తన తల్లితో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగడమే కాకుండా వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన తల్లి సరోజమ్మ ఫిర్యాదులో పేర్కొంది.

ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అతని మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో ఉండటం వల్ల పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు.ఇక తన తల్లి తన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ రఘు తన తల్లిని దారుణంగా రోడ్డుపై ఈడ్చి కెళ్లిన అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ విషయంపై ఆయన మాట్లాడుతూనేను తల్లిదండ్రుల పై దాడి చేయకపోయినా నా పై తప్పుడు కేసులు పెట్టి నా పరువు తీయాలని భావిస్తున్నారని వెల్లడించారు.