Samantha : మెగా కాంపౌండ్లో సమంత మళ్లీ సందడి చేయబోతోందా.? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయ్. మెగా కాంపౌండ్ హీరోలతో సమంతకు మంచి అనుబంధం వుంది. మెగా హీరోలతో సమంత నటించిన సినిమాలన్నీ సంచలన విజయాలు అందుకున్నవే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సమంత నటించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిందీ సినిమా. అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సమంత నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా సెన్సేషనల్ హిట్టే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన సమంత నటించిన ‘రంగస్థలం’ మూవీ తెలుగు సినిమా రాతనే మార్చేసింది. రామలక్ష్మిగా ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది సమంత.
అలాగే, రీసెంట్గా ‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్తో సమంత వేసిన ‘స్పెషల్’ చిందులు ఆడియన్స్ చేత ఎలా ఊ కొట్టించాయో, ఉలిక్కిపడేలా చేశాయో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అసలు విషయంలోకి వస్తే, సమంత బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్లు పోటెత్తుతున్న వేళ, మెగా కాంపౌండ్ నుంచి ఓ క్రేజీ ట్వీట్ నెటిజన్స్ని విశేషంగా ఆకర్షిస్తోంది.
‘జెస్పీ..! నువ్వు ఏం మాయ చేశావో కానీ, ఎటో వెళ్లిపోయింది మనసు..’ అంటూ మెగా కాంపౌండ్ నుంచి సమంతకు బర్తడ్ విషెస్ వచ్చాయ్.
ఇంతకీ ఈ ట్వీట్ వేసిందెవరనుకుంటున్నారా.? మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. తేజు తన ట్వీట్లో ‘నీ వీరాభిమాని’ అని కూడా పేర్కొన్నాడు. అందుకే ఈ ట్వీట్ వెరీ వెరీ స్పెషల్గా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అంతేకాదు, ఈ ట్వీట్ బట్టి చూస్తుంటే, తేజు సినిమాలో సమంత నటిస్తోందా.? అనే అనుమానాలు కూడా మొలకెత్తుతున్నాయ్.
మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా వున్న వేళ, సమంతకు కూడా తన సినిమాలో ఓ ఛాన్సిచ్చేస్తాడా.? అనే గాసిప్పులు కూడా వినిపిస్తున్నాయ్.
ఇంతకీ జెస్పీ మెగా కాంపౌండ్లో ఏ హీరోతో జత కట్టబోతోంది.? మామ చిరంజీవితోనా.? లేక మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తోనా.? లేదంటే, ఓ పనైపోతుందని ఇద్దరితోనూ స్ర్కీన్ షేర్ చేసుకోబోతోందా.? చూడాలి మరి.
