Adhire Abhi: జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోయిందని రష్మీని తీసుకొచ్చి పెట్టారు: అదిరే అభి

Adhire Abhi: యాంకర్స్ విషయానికొస్తే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో వాళ్లకు కేటాయించిన టీంలను సీనియారిటీ ప్రకారం డివైడ్ చేయలేదని జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి అన్నారు. ఫస్ట్ అనసూయ చేసి కొన్ని రోజులు తనకు కొన్ని పనులు ఉండడం వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చింది అని ఆయన అన్నారు. ఆ తర్వాత షోకి రష్మీ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

రష్మీ వచ్చిన కొన్ని రోజులకు ఎక్స్ ట్రా జబర్దస్త్ వచ్చిందని, ముందు ఒకటే ఉండేదని, ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ కూడా కంటిన్యూ అయిందని ఆయన వివరించారు. ఒక సంవత్సరం తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ వచ్చిందని, అప్పుడు రెండు షోలను కూడా రష్మీనే హ్యాండిల్ చేసేదని ఆయన చెప్పారు. మళ్ళీ ఎప్పుడైతే అనసూయ వచ్చిందో, అప్పుడు జబర్దస్త్ అనసూయకు, ఎక్స్ ట్రా జబర్దస్త్ రష్మీకి, అలా ఇద్దరికీ ఒక్కో ఎపిసోడ్ లాగా ఇచ్చారని ఆయన తెలిపారు.

అంతే గానీ కంటేస్టెంట్స్ మాత్రం మారుతూ ఉంటారని అభి చెప్పారు. ఉదాహరణకు తీసుకుంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఫస్ట్ చంద్ర ఉండేవారని, అతను సీనియర్ అని, అలాగే రాఘవ కూడా సీనియర్ అని, కాబట్టి సీనియర్ ఒక సైడ్, జూనియర్స్ ఒక సైడ్ అన్నట్టు లేదని అభి చెప్పారు. ఆరు టీమ్స్ లో కొంత మంది ఇటు, కొంత మంది అటు అన్నట్టుగా డివైడ్ చేశారని ఆయన తెలిపారు.

ఇకపోతే అనసూయ అప్పుడు వెళ్ళిపోయినపుడు చాలా రూమర్స్ వచ్చాయి గానీ అవన్నీ నిజాలు కావని అభి స్పష్టం చేశారు. తనకు తెలిసి ఆమె ఆ సమయంలో మెటర్నిటీ లీవ్ తీసుకొని ఉంటుందేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు.