Anchor Rashmi: సమంత పాటతో అందరిని ఊ అనిపించిన రష్మీ.. వైరల్ అవుతున్న ఆది కామెంట్స్..!

Anchor Rashmi: బుల్లితెరపై యాంకర్ రష్మి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. తన యాంకరింగ్ తో , తన అందంతో కుర్రకారుని తన అభిమానులుగా మార్చేసుకుంది . సుధీర్ , రష్మి కాంబినేషన్లో ఉండే ఏ ప్రోగ్రాం అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా రష్మీ పాపులారిటీ సొంతం చేసుకుంది . ఏదైనా అకేషన్ వచ్చిందంటే చాలు బుల్లితెర నటులందరూ ప్రేక్షకులను అలరించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో టీవి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మమ్మగారి ఊరు అనే కార్యక్రమాన్ని ఈటీవీ లో ఏర్పాటు చేశారు.

ఇటువంటి కార్యక్రమాలలో నటీనటులు , యాంకర్స్ జబర్దస్త్ కమెడియన్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. ఇటీవల ఈటీవీ వారు నిర్వహించిన అమ్మమ్మగారి ఊరు అనే కార్యక్రమం ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతుంది. ఇటువంటి కార్యక్రమాలలో సుధీర్ ఆది పంచులతో , కామెడీ టైమింగ్ తో అందరిని నవ్విస్తారు. తాజాగా విడుదలైన అమ్మమ్మగారి ఊరు ప్రోమోలో రష్మి పుష్ప సినిమాలోని సమంత పాటకు డాన్స్ అదరగొట్టింది. ఊ అంటావా మామ అంటూ సమంత ఐటమ్ సాంగ్ డాన్స్ చేయడంతో రష్మీ డాన్స్ పర్ఫార్మెన్స్ పై ఆది తనదైన శైలిలో పంచ్ వేశాడు. రష్మి ఇలా డాన్స్ చేస్తే అందరూ ఊ అనాల్సింది అంటూ కామెంట్ చేశారు.

ఈటీవీ లో మల్లెమాల ప్రొడక్షన్ వారు నిర్వహించిన ఈ అమ్మమ్మగారి ఊరు కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు. రోజా ఆమని ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ అందరూ తమ కామెడీ పంచ్ లతో వినోదాన్ని పంచారు . ఇక సమంత పాటకు రష్మీ చేసిన మెస్మరైజింగ్ డాన్స్ పర్ఫామెన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఈ కార్యక్రమంలో జరిగే సరదా సన్నివేశాలు పూర్తిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే సంక్రాంతి పండుగ వరకు వేచి చూడాల్సిందే.