ప్రభాస్ జస్ట్ మిస్.. తృటిలో తప్పింది

Prabhas takes self isolation

Prabhas takes self isolation

రెబల్ స్టార్ ప్రభాస్ కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నా కూడ చిత్రీకరణలు ఆపలేదు. అన్ని పెద్ద సినిమాలు ప్యాకప్ చెప్పినప్పటికీ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మాత్రం నడుస్తూనే ఉంది. ఇంకొన్ని రోజులు షూట్ జరిపితే సినిమా కంప్లీట్ అవుతుంది. అప్పుడిక పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవచ్చు. ఆ ఉద్దేశ్యంతోనే ప్రభాస్ పరిస్థితులు బాగోలేకపోయినా ధైర్యం చేసి షూట్ నడిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చిత్రీకరణ నిలిపివేయక తప్పలేదు. అందుకు కారణం కరోనా వైరస్ ప్రభాస్ కు అతి సమీపంలోకి రావడమే.

ప్రభాస్ వ్యక్తిగత మేకప్ బృందంలో ఒకరికి కరోనా లక్షణాలు బయటపడ్డాయట. అతని ప్రతిరోజూ షూటింగ్లో ప్రభాస్ కు అతి దగ్గరగా మెలిగే వ్యక్తి. అందుకే విషయం తెలియగానే షూటింగ్ నిలిపివేసి ప్రభాస్ సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లిపోయారట. ప్రభాస్ సహా బృందంలోని సభ్యులు అందరూ పరీక్షలు చేయించుకునే ఉదేశ్యంలో ఉన్నారట. పరిస్థితులు చక్కబడిన తర్వాతనే ప్రభాస్ సెట్స్ మీదకు వెళ్తారట. మొత్తానికి సినిమా కోసం ప్రభాస్ రిస్క్ చేస్తే ఆయనే రిస్క్ లో పడినంత పనైంది.